పల్నాడు జిల్లా రెంటచింతలలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ ఏజెంట్ల విషయంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ముగ్గురికి గాయాలవ్వగా.. వారిని గురజాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల రంగ ప్రవేశంతో గొడవ సద్దుమణిగింది.