వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. లోకేష్ ఒక పప్పు, దేవినేని ఉమా మహేశ్వర రావు బుద్దిహీనుడని ఫైర్ అయ్యారు. జగన్ విదేశాలకు పోతే పారిపోయారు అంటున్నారు. చంద్రబాబు విదేశాలకు వెళితే మెడికల్ చెకప్ కు అంటున్నారని మండిపడ్డారు. లోకేష్, దేవినేని ఉమాలు మర్యాదగా మాట్లాడాలని హెచ్చరించారు.