నేడు జరుగుతున్న ఏడో దశ లోక్సభ ఎన్నికల్లో తొలి రెండు గంటల్లోనే 11.31 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల వరకూ 11.31 శాతం మేర పోలింగ్ నమోదైంది. హిమాచల్ ప్రదేశ్లో 14.35 శాతం, బీహార్లో 10.58 శాతం, చండీగఢ్లో 11.64 శాతం, జార్ఖండ్లో 12.15 శాతం, పంజాబ్లో 9.64 శాతం, ఉత్తరప్రదేశ్లో 12.94 శాతం, పశ్చిమ బెంగాల్లో 12.63 శాతం, ఒడిశాలో 7.69 శాతం మేర పోలింగ్ నమోదైంది.