ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీలో దద్దరిల్లింది. ఆప్ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్ పిలుపుమేరకు కార్యకర్తలు, నాయకులు ఇవాళ ఉదయం నుంచే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఆప్ కార్యాలయం నుంచి ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఆప్ శ్రేణులు బయలుదేరగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆప్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.