కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాలా తాలూకా పనేమంగళూరులో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై ఆటో రిక్షా, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 19 ఏళ్ల మహమ్మద్ అల్తాఫ్ కింద పడిపోయాడు. దీంతో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు హుటాహుటిన అల్తాఫ్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అల్తాఫ్ చనిపోయాడు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.