బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీం అనర్ కోల్కతాలో హత్యకు గురయ్యారు. అన్వరుల్ ఈ నెల 12న కోల్కతాకు వచ్చారు. ఆ మర్నాడు వైద్య పరీక్షల కోసం మిత్రులతో కలిసి బిధాన్ నగర్లో ఓ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత కనిపించలేదు. బంగ్లాదేశ్లోని తన కుమార్తె ఫిర్యాదు మేరకు బారానగర్ పీఎస్లో 18న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముగ్గురు బంగ్లా దేశీయులను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును సీఐడీకి అప్పగించారు.