కేంద్ర ప్రభుత్వ బలగాలు బంగ్లాదేశ్ ఎంపీ అదృశ్యం కేసు దర్యాప్తులో భాగమయ్యాయి. ఈ క్రమంలో వారు బుధవారం కోల్కతాలోని టౌన్హాల్కు చేరుకోగా.. అక్కడ రక్తపు మరకలు కనిపించాయి. సమీపంలోని సీసీటీవీ దృశ్యాల్లో.. మే 13న ఎంపీ నివాసానికి అనర్తో పాటు ఇద్దరు పురుషులు, ఒక మహిళ ప్రవేశించారు. మే 13, 15న ఆ ముగ్గురు వేర్వేరు సమయాల్లో పెద్ద బ్యాగుల్ని వెంట తీసుకోని వెళ్లిపోయారు. కానీ, ఎంపీ బయటకు వెళ్లినట్లు రికార్డు కాలేదు. కాగా.. ఆ బ్యాగుల్లో ఏమున్నాయో తెలియాల్సి ఉంది.