ఐపీఎల్లో కీలకమైన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. హైదరాబాద్-రాజస్థాన్ తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. దీనిపై రాజస్థాన్ ఆటగాడు అశ్విన్ స్పందించారు. ‘ఎవరి హోం గ్రౌండ్ వారికి స్పెషల్. నాకు కూడా చెపాక్ ఇలాంటిదే. చాన్నాళ్లపాటు ఎన్నో సాధించిన మైదానం అది. బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపించా. తప్పకుండా ఈసారి మా జట్టు కోసం కీలక ప్రదర్శన చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని తెలిపాడు.