కరీంనగర్ బస్స్టేషన్లో గర్భిణికి కాన్పు చేసిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ మహిళా సిబ్బందికి అభినందనలు తెలిపారు. సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు సీఎం ట్విటర్లో పోస్టు పెట్టారు.