ప్రముఖ ఫుట్బాల్ కోచ్ టీకే చతుణ్ణి (79) చనిపోయారు. క్యాన్సర్తో పోరాడుతూ త్రిసూర్ సమీపంలోని కారుకుట్టిలోని అపోలో ఆసుపత్రిలో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన సంతోష్ ట్రోఫీలో కేరళ, గోవా జట్ల తరుపున ఆటగాడిగా ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత ఆయన కోచ్గా మారారు. మోహన్ బగాన్, డెంపో గోవా, FC కొచ్చిన్లతో సహా ప్రసిద్ధ జట్లకు శిక్షణ ఇచ్చారు. ఆయన మృతికి కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు.