ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి గాయాలయ్యాయి. తూర్పు ఢిల్లీలోని కృష్ణా నగర్ ప్రాంతంలోని 4 అంతస్తుల నివాస భవనంలో ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో 12 మందిని రక్షించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.