ఓ వ్యక్తి విమానం వాష్రూమ్లో సిగరెట్ తాగి కటకటాల పాలయ్యాడు. ఈనెల 26న సాయంత్రం 5.15 గంటలకు ఇండిగో విమానం 176 మంది ప్రయాణికులతో ఢిల్లీ విమానాశ్రయం నుంచి ముంబై బయల్దేరింది. విమానం ముంబై ఎయిర్పోర్ట్లో దిగడానికి 50 నిమిషాల ముందు ఉత్తరప్రదేశ్కు చెందిన 36 ఏళ్ల ఖలీజ్ కాజమ్ముల్ ఖాన్ అనే ప్రయాణికుడు టాయిలెట్కు వెళ్లి.. వాష్రూమ్లో సిగరెట్ తాగాడు. విమాన సిబ్బంది ఫిర్యాదుతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.