మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ హైకోర్టును కోరింది. బెయిల్ వ్యవహారాలను అనవసరంగా వాయిదా వేయరాదని, తదుపరి విచారణలో పిటిషన్పై తీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సూచించింది. 2017లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసులో జైన్ను ED మే 30, 2022న అరెస్టు చేసింది.