కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కూలి నెలలు గడిచినా కేసీఆర్ నోరు విప్పలేదని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ ధనదాహానికి బలైందని విమర్శించారు. రూ.97 వేల కోట్లు ఖర్చు చేసి 97 వేల ఎకరాలకూ నీళ్లవ్వలేదన్నారు. డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీ తానై కట్టానని కేసీఆర్ చెప్పారని.. మరి ఇప్పుడు ఎందుకు కేసీఆర్ నోరు విప్పట్లేదు? అని ప్రశ్నించారు.