గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రిగా కొలుసు పార్థ సారధి సచివాలయంలోని ఐదో బ్లాక్లో బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి, పూర్తయిన వాటికి చాలా అంతరం ఉందన్నారు. కేంద్ర పథకాలు, అమృత్ పథకాలు, ఎన్ఆర్ఈజీఎస్ కింద గృహ నిర్మాణశాఖకు నిధులు తెచ్చుకోగలమని పేర్కొన్నారు. సమస్యలపై సమీక్ష చేసి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు.