యూపీ మెయిన్పురిలోని కర్హల్ రోడ్డులో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ లారీ రోడ్డుపై బీభత్సం సృష్టించింది. తొలుత సైకిల్పై వెళ్తున్న బాలికను ఢీకొట్టింది. అనంతరం స్కూటీపై వెళ్తున్న మహిళను లారీ ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో సైకిల్పై వెళ్తున్న బాలిక, స్కూటీపై వెళ్తున్న మహిళ ఇద్దరూ చనిపోయారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.