ఇన్ స్టాలో పరిచయమైన ప్రియుడి కోసం తన భర్తను, పిల్లల్ని వదిలి వెళ్ళింది ఓ వివాహిత. ఈ ఘటన రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగింది. 32 ఏళ్ల నమీ దేవికి ఇన్స్టాగ్రామ్లో జానపద గాయకుడు భీమారామ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతడి కోసం తన భర్త, ఐదుగురు పిల్లలను వదిలివేసింది. జైసల్మేర్ నుండి ఆమె గుజరాత్ వెళ్ళి అతడితో లివ్-ఇన్ రిలేషన్షిప్ మొదలు పెట్టింది. మహిళ అదృశ్యమైనట్లు భర్త ఫిర్యాదు చేయగా.. పోలీసుల దర్యాప్తులో ఈ తతంగం బయటపడింది.