చెన్నైలో కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. చెన్నైలోని పల్లికరణ్లో కులమతాలకు అతీతంగా షర్మి అనే మహిళను పెళ్లి చేసుకున్న ప్రవీణ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. షర్మి సోదరుడు దినేష్, ముగ్గురు సహచరులు కలిసి ప్రవీణ్ను కొడవలితో దారుణంగా నరికి చంపారు. అక్కడి నుంచి పారిపోయిన నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.