నా ఫేవరెట్ క్రికెటర్ రోహిత్: యూఎస్ఏ కెప్టెన్

నేడు రాత్రి భారత్‌తో యూఎస్ఏ కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో యూఎస్‌ఏ క్రికెట్ జట్టు సారథి మోనాంక్ పటేల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత్‌తో ఆడటం ప్రతి ఒక్కరి డ్రీమ్. టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్‌, అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో మైలురాళ్లను నెలకొల్పారు. ఇలాంటి జట్టుతో ఆడే అవకాశం రావడం గొప్ప విషయం. నా ఫేవరెట్‌ క్రికెటర్‌ రోహిత్ శర్మ. అతడితో కలిసి టాస్‌ వేసే అవకాశం రావడం ఎప్పటికీ మరిచిపోలేని సంఘటన’’ అని మోనాంక్‌ వెల్లడించాడు.

సంబంధిత పోస్ట్