భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఒకటికి మించిన లక్ష్యాలను ఒకేసారి ఖచ్చితత్వంతో ఛేదించగల అత్యాధునిక ఖండాంతర అణుక్షిపణి అగ్ని - 5ను 11-03-2024న తొలిసారిగా ప్రయోగించింది. ‘మిషన్ దివ్యాస్త్ర’ పేరిట ఒడిశా తీర సమీపంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. దీనిలో ఎంఐఆర్వీ సాంకేతికత ద్వారా ఒకే క్షిపణితో వేర్వేరు లక్ష్యాలపై అనేక వార్ హెడ్లను పూర్తి ఖచ్చితత్వంతో ప్రయోగించవచ్చు.