ధరణి పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న 2.20 లక్షల దరఖాస్తులు పరిష్కరించాలని CCLA కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశించారు. ధరణిపై ఇవాళ కలెక్టర్లతో నవీన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెలాఖరులోగా వీలైనన్ని దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. పాస్బుక్ డేటా కరెక్షన్ కోసమే ఎక్కువ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ధరణిలో 163 సాంకేతిక లోపాలు పరిష్కరించినట్లు మిట్టల్ వెల్లడించారు. వారం తర్వాత మరోసారి సమీక్షించాలని నిర్ణయించారు.