కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS ఎంపీ అభ్యర్థి RS ప్రవీణ్కుమార్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ ఆదేశాలతోనే BRS కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేసులకు BRS కార్యకర్తలు ఎవరూ భయపడరని స్పష్టంచేశారు. కరీంనగర్లో ఇవాళ నిర్వహించిన పార్లమెంటరీ యుద్ధ భేరీ సదస్సు ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. కరీంనగర్ కదన కుతూహలం మే 13 వరకు కొనసాగాలని పిలుపునిచ్చారు. 100 రోజుల్లో 200 మంది రైతులు మరణిస్తే సీఎం ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు.