సిద్ధిపేట జిల్లాలో రూ. 12,000 కోట్ల బడ్జెట్తో 2017 జూన్ 20న నాటి సీఎం కేసీఆర్ గొర్రెల పథకాన్ని ప్రారంభించారు. ఒక్కో యూనిట్కు 21 గొర్రెలకు గాను రూ. 1,25,000 ఇచ్చారు. ఆ తర్వాత యూనిట్ ధరను రూ.1,75,000కు పెంచారు. ఇందులో రూ. 1,31,250ను రాష్ట్ర ప్రభుత్వం భరించగా.. రూ. 43,750ను లబ్దిదారుడు భరించారు. ఈ పథకంలో పలు దశల్లో అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.