టీ20 వరల్డ్ కప్-2024 తొలి మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభించారు. న్యూయార్క్లో బుధవారం జరుగుతున్న మ్యాచ్లో ఐర్లాండ్ను 16 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌట్ చేశారు. ఐర్లాండ్ బ్యాటర్లంతా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య 3, అర్ష్దీప్, బుమ్రా చెరో 2, సిరాజ్, అక్షర్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ప్రస్తుతం భారత్ ముందు కేవలం 97 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది.