AP: మాచర్లలో ఈవీఎం ధ్వంసం వెనుక అసలు నిజాలివే అంటూ వైసీపీ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. రెంటచింతల మండలం పాల్వాయిగేటులో వైసీపీ ఏజెంట్లని టీడీపీ నేతలు కొట్టి పోలింగ్ బూత్ నుంచి బయటికి పంపారు. వైసీపీకి ఓటు వేసే అవకాశం ఉన్న వారిపై కూడా దాడి చేశారు. ఇది తెలుసుకొని అక్కడికి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కూడా దౌర్జన్యం చేశారు. అసలు విషయాలు దాచేసి టీడీపీ బురదజల్లుతోందని వైసీపీ పేర్కొంది.