తమ ప్రభుత్వ హయాంలో చేసిన మంచి పనులు చెప్పుకోలేకనే స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి కూడా యువతకు దూరమయ్యామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచి కూడా వారికి దూరమయ్యామన్నారు. నర్సంపేటలో ఏర్పాటు చేసిన వరంగల్ – నల్లగొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచార సభలో కేటీఆర్ పాల్గొని పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.