వరద ఉద్ధృతికి ముగ్గురు మృతి
గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడులో వరద ఉద్ధృతికి శనివారం ఓ కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న టీచర్ సహా ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులను రాఘవేంద్ర, సాత్విక్, మాన్విక్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ర్షాల నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.