అచ్చుతాపురం మండలం కొండకర్ల గ్రామానికి చెందిన టీడీపీకి చెందిన సుంకరపు జగదీశ్వరరావు, సానా వీరునాయుడు, నడిపింటి రాజబాబుతో పాటు పలువురు యువకులు బుధవారం వైసీపీలో చేరారు. ఈ మేరకు వారికి యలమంచిలి నియోజకవర్గ అభ్యర్థి కన్నబాబు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ. వైసీపీ విజయానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ ఛైర్మన్ సుకుమార్ పాల్గొన్నారు.