ధర్మవరం పట్టణంలోని సిద్దయ్య గుట్టకు చెందిన దూద్వలి (25) ఆరోగ్యం సరిగా లేక మనస్థాపానికి గురై పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద సోమవారం విష ద్రావకాన్ని సేవించి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తూ, కేసు నమోదు చేసుకున్నారు.