కేరళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి మాస పూజల్లో సోమవారం బైరెడ్డిపల్లె మండలానికి చెందిన అయ్యప్ప మాలధారణ భక్తులు పాల్గొన్నారు. అనంతరం శబరిమల ఆలయ ప్రధాన అర్చకులుని కలసి ఆశీర్వచనాలు పొందారు. ఈ కార్యక్రమంలో మురళీధర్ ఆచార్యులు, సురేష్, భరత్ పాల్గొన్నారు.