నియోజకవర్గంలోని శివాలయాలలో సోమవారం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలలోని స్వామివారికి విభూది అభిషేకం, శివ పంచాక్షరి మంత్రాలతో అర్చనలు చేశారు. పార్వతీ పరమేశ్వరులను పలు రకాల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయాలు శివనామస్మరణతో మారు మృోగాయి. మహా మంగళహారతి అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.