తుమ్మలగుంటలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

73చూసినవారు
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గ‌రుడ‌సేవ‌ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామివారు గరుడవాహనం నుంచి ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను క‌టాక్షించారు. గ్రామంలో గరుడ వాహనం పై విహరించే స్వామి వారిని దర్శించిన భక్తులు హారతులతో మొక్కలు తీర్చుకున్నారు. గరుడ వాహన సేవలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, ‌మోహిత్ రెడ్డిలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్