మదనపల్లి మండలం చెంబకూరు రోడ్డు రెక్క మాను సమీపంలోని అడవిలో బుధవారం గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలిసింది. సమాచారం తెలుసుకున్న మదనపల్లి తాలూకా పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు ఎవరన్నది తెలియ రాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.