నల్లగుట్టపల్లిలో దంపతులపై దాడి

10905చూసినవారు
నల్లగుట్టపల్లిలో దంపతులపై దాడి
తాగి ఇంటి ముందు గొడవ పడవద్దనడంతో మందుబాబులు దంపతులపై దాడిచేశారు. ఈ ఘటన మదనపల్లె మండలం వేంపల్లి గ్రామంలోని నల్లగుట్ట పల్లిలో ఆదివారం వెలుగు చూసింది. తాలూకా పోలీసుల కథనం మేరకు. నల్లగుట్టపల్లిలో సి. నారాయణ(49) గోపమ్మ(40)ల ఇంటి ముందు మందు బాబులు కే. నారాయణ వర్గీయులు పూటుగా మద్యం తాగి గొడవ పడుతుండడాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కె. నారాయణ వర్గీయులు సి. నారాయణ దంపతులపై దాడి చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్