కారు ఢీకొని ఆటో బోల్తా పడి పలువురికి తీవ్ర గాయాలు

9370చూసినవారు
కారు ఢీకొని ఆటో బోల్తా పడి పలువురికి తీవ్ర గాయాలు
కారు ఢీకొని ఆటో బోల్తా పడి పలువురు తీవ్రంగా గాయపడ్డ ఘటన బసినికొండలో ఆదివారం రాత్రి జరిగింది. మదనపల్లె తాలూకా పోలీసుల వివరాల మేరకు. టేకులపాలేనికి చెందిన పలువురు కూలీలు, పుంగనూరు మండలం ఒంటిమిట్టకు కూలీ పనులకు వెళ్లారు. వారంతా పనులు ముగించుకుని రాత్రి ఆటోలో టేకులపాలేనికి వస్తుండగా బసినికొండ పుంగనూరు రోడ్డు, గంగమ్మగుడి వద్ద కారు ఢీకొట్టింది. పలువురు గాయపడగా మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్