కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కల్పిస్తుందని పీలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన పీలేరు పట్టణంలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యుఐ నాయకులు దుబ్బ శ్రీకాంత్, అమృత తేజ, యూసఫ్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.