ప్రశాంతంగా ముగిసిన ఎంజేపీ ప్రవేశ పరీక్ష

85చూసినవారు
ప్రశాంతంగా ముగిసిన ఎంజేపీ ప్రవేశ పరీక్ష
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలలో ఎంజేపీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్టు చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాస రెడ్డి శనివారం సాయంత్రం తెలిపారు. ఆయన మాట్లాడుతూ రానున్న విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహించామన్నారు. 295 మంది విద్యార్థులకు గాను 31 మంది గైర్హాజరు అయినట్టు ఆయన చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్