తంబళ్లపల్లె: 51. 52శాతం రేషన్ పంపిణీ

77చూసినవారు
తంబళ్లపల్లె మండల వ్యాప్తంగా ఆదివారానికి 51. 52 శాతం రేషన్ సరకులను పంపిణీ చేసినట్లు తహశీల్దార్ బ్రహ్మయ్య, సీఎస్ డీటీ భువనేశ్వరి తెలిపారు. బియ్యం, చక్కెరతో పాటు ప్రభుత్వ రాయితీ ధరకు రాగిపిండిని పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 17వ తేదీ లోగా వంద శాతం పంపిణీ పూర్తి చేస్తామన్నారు. పట్టణంలోని వెంకటేశ్వర వీధిలో ఆదివారం సాయంత్రం రేషన్ సరుకుల కోసం ఎండీయూ వాహనం వద్ద ప్రజలు బారులుదీరారు.

సంబంధిత పోస్ట్