ఉండ్రాజవరం మండలం కె. సావరం గ్రామంలో "గడప గడపకు" కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు తనయుడు వరుణ్ సాయి శుక్రవారం పాల్గొన్నారు. అనంతరం ఆయన గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడుగు తెలుసుకున్నారు. అలాగే రానున్న ఎన్నికల్లో వైసీపీని మరలా గెలిపించాలన్నారు.