వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే 24 గంటలూ తాగునీరు ఇచ్చేలా చేస్తానని ఎంపీ భరత్ చెప్పుకొచ్చారు. శనివారం రాత్రి రాజమండ్రిలోని పుష్కరఘాట్ వద్ద 'భరత్ టెన్ ప్రామిసెస్' పేరుతో కూడిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రౌడీషీటర్లు, బ్లేడ్, గంజాయి బ్యాచ్లను నగర బహిష్కరణ చేస్తానని, 24 గంటలూ మంచినీటి సరఫరా, పదివేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తదితర హామీలు ఇచ్చారు.