అనపర్తిలో ఎన్నికల పరిశీలకులు పర్యటన

70చూసినవారు
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించ ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన జయ అరవింద్, నితిన్ కోటయ్యలు గురువారం అనపర్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్వో కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల నియమావళి, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల గురించి తదితర అంశాలపై ఆర్వో మాధురి తో చర్చించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు చెక్ పోస్ట్ లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్