ఘనంగా వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

72చూసినవారు
పంచారామ పుణ్య క్షేత్రమైన సామర్లకోట కుమార రామ. భీమేస్వరాలయంలో బాల త్రిపుర సుందరి అమ్మవారికి వసంత నవరాత్రి మహోత్సవం మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో ఆలయ పండితులు సోమేశ్వరశర్మ, చెరుకూరి రాంబాబు తదితరులచే శాస్త్రోక్తంగా పూజలు చేశారు. బిక్కిన పరమేశ్వర సాయి సత్యనారాయణ దంపతులు, జనసేన నాయకులు బిక్కిన రాజశేఖర్ దంపతులు ఆశీనులయ్యి పూజలు చేశారు. ప్రసాద వితరణ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్