నేడు ఈ మండలాల్లో పాఠశాలకు సెలవు

59చూసినవారు
నేడు ఈ మండలాల్లో పాఠశాలకు సెలవు
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని పలు పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్లు విద్యాశాఖ అధికారి రమేష్ తెలిపారు. కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాల మేరకు జిల్లాలోని గొల్లప్రోలు, యు.కొత్తపల్లి, పిఠాపురం, కిర్లంపూడి మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని అన్ని పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు గమనించాలన్నారు.

సంబంధిత పోస్ట్