ధవళేశ్వరం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

73చూసినవారు
రాజమండ్రి రూరల్ పరిధిలోని ధవలేశ్వరం బ్యారేజీ వద్ద జారీ చేసిన 2వ ప్రమాద హెచ్చరికను శుక్రవారం ఉదయం 6 గంటలకు ఉప సంహరించారు. గోదావరి వరద క్రమేపీ తగ్గుముఖం పట్టి, నీటిమట్టం 13. 70 అడుగులకు చేరడంతో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. కాగా 12, 47, 419 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 40. 50 అడుగులకు చేరిందని కేంద్ర జల సంఘం అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్