కూనవరం మండలంలోని కూటూరు ముల్లూరులో పెసా గ్రామసభలు నిర్వహించాలని యూత్ కమిటీ సభ్యుడు సున్నం రాజశేఖర్ కోరారు. మంగళవారం కూటూరు నుంచి ఆయన మాట్లాడుతూ ముల్లూరు కూటూరు గ్రామాలకు వేరువేరు గ్రామ సభలు ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శిని కోరడం జరిగిందన్నారు. నెలలు గడుస్తున్న నేటి వరకు గ్రామ సభలు నిర్వహించలేదన్నారు. అధికారులు స్పందించి గ్రామసభలు నిర్వహించి తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.