ఈనెల 21 నుంచి మారేడుమిల్లి సర్కిల్ పరిధిలోని ఆకుమామిడి కోటలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు మారేడుమిల్లి సీఐ గోపాలకృష్ణ బుధవారం తెలిపారు. ఆరోజు ఉదయం ఏడు గంటల నుంచి పోటీలు ప్రారంభమవుతాయన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీల్లో గిరిజన క్రీడాకారులు పాల్గొనాలని కోరారు.