కామవరపుకోటలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు శనివారం సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి వేర్వేరుగా మొత్తం రూ. 2. 53 లక్షల నగదును గుర్తించారు. సరైన ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశామని తెలిపారు. ఎన్నికల నిబంధనలు మేరకు రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు ఉంటే సీజ్ చేస్తామని చెప్పారు.