అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటించాలి

68చూసినవారు
నేటి నుంచి నామినేషన్లు ప్రక్రియ కావడంతో ఏలూరు జిల్లా చింతలపూడి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర గురువారం పరిశీలించారు. నామినేషన్ వేయుటకు వచ్చే అభ్యర్థులు కచ్చితంగా ఎన్నికల నిబంధనలను పాటించాలని అన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.

సంబంధిత పోస్ట్