నందిగం సురేష్ కు రెండు వారాల రిమాండ్

55చూసినవారు
నందిగం సురేష్ కు రెండు వారాల రిమాండ్
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. గురువారం ఉదయం పోలీసులు హైదరాబాద్ నుంచి ఆయనను ఇక్కడికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న ఆయన్ను కోర్టులో హాజరుపరచగా, ఆయనకు న్యాయస్థానం గురువారం 2వారాలు రిమాండ్ విధించింది. మాజీ ఎంపీని కోర్టుకు తరలించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్