కొండాపురం మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన లావనూరు,పొట్టిపాడు, ఎన్.కె కాలువ,తిమ్మాపురం,పి.అనంతపురం గ్రామాలలో సిఐ వేణుగోపాల్,స్పెషల్ ఆఫీసర్ నారాయణ యాదవ్,ఎస్సై యోగేంద్ర ఆధ్వర్యంలో శనివారం కేంద్ర బలగాలతో కలిసి పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.సిఐ మాట్లాడుతూ..రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని,గ్రామాలలో ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని అన్నారు.